సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సందడి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో వేడుక అద్భుత రీతిలో జరగటంతో సినిమాకి సంబంధించి అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్‌ మేకర్లు, టిక్‌ టాకర్లు చేసే సందడి గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా పైన కూర్చోబెట్టాలన కొండ మీద ఉన్న వారిని కిందకు దించాలన్న మీమ్‌ మేకర్లు, టిక్‌ టాకర్లు వీళ్ళు చేసే సోషల్ మీడియాలో హడావిడి చాలు. అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సరిలేరు నీకెవరు సినిమా వీళ్ళ కోసం స్పెషల్ గా డిజైన్ చేసినట్టు ఉందని ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

మేటర్ లోకి వెళ్తే అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలలో తన మేనరిజం కి తగ్గ విధంగా కామెడీ తరహాలో చేసే సినిమాలో ఓ డైలాగ్ తో సినిమా చూసే ప్రేక్షకుడికి ఆకట్టుకుంటాడు. రాజా ది గ్రేట్‌లో ముఖచిత్రం డైలాగ్‌, ఎఫ్‌2లో అంతేగా అంతేగా, సుప్రీమ్‌లో ఇట్స్‌ అమేజింగ్‌ జింగ్‌ జింగ్‌ అంటూ మీమ్‌ మేకర్లకి బోలెడు స్టఫ్‌ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరులో కూడా అలాంటి చమక్కులు చాలానే వున్నాయని ట్రెయిలర్‌లోనే చూపించేసాడు.

 

రష్మికకి 'అర్థమవుతోందా' అనే ఊతపదం, సంగీతకి 'అబ్బబ్బబ్బబ్బా... నెవర్‌ బిఫోరు ఎవర్‌ ఆఫ్టరు' అంటూ మేనరిజమ్‌ డైలాగ్‌ పెట్టాడు. ఇవి ఇప్పటికే టిక్‌ టాకర్లకి బాగా ఎక్కేసాయి. నైట్‌కి నైట్‌ చాలా మంది వీడియోలతో దిగిపోయారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో వేల హడావిడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో సంబంధించి డైలాగులతో రెచ్చిపోతున్నారు. ఖచ్చితంగా సినిమాకి మంచి హైప్ సోషల్ మీడియా లో ఉందని రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కి ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయి అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: