కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకత్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2.0, అలానే పేట సినిమాలు రెండు కూడా మంచి హిట్ కొట్టి, కెరీర్ పరంగా అతకముందు కొంత సతమతం అవుతున్న రజినీకి వరుస విజయాలు అందించాయి. ఇక ప్రస్తుతం అదే ఊపులో ఆయన నటిస్తున్న తాజా సినిమా దర్బార్. యువ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో భారీగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు రజిని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది అనే చెప్పాలి. 


మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో మరొక హిట్ కొట్టి, రజిని హ్యాట్రిక్ విజయాలు అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాపై కొంత నెగటివ్ విమర్శలు వినిపిస్తున్నట్లు చెప్తున్నారు. సినిమాలో ఎక్కువ శాతం యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయని, అలానే సినిమాలో కామెడీ తక్కువగా ఉండడంతో పాటు ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత బోరింగ్ గా సాగుతుందని సమాచారం. ఇక అక్కడక్కడా కొన్ని కీలక సీన్స్ అలరించినప్పటికీ, ఓవర్ ఆల్ గా ఈ దర్బార్ సినిమా కేవలం యావరేజ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని తేల్చేస్తున్నారు. 

 

ఇటీవల తాను తీసిన స్పైడర్, సర్కార్ సినిమాలతో పరాజయాలు చవి చూసిన మురుగదాస్, ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా కనుక దర్బార్ సినిమా తీసినట్లైతే, ఈ సినిమా ద్వారా మరొక అపజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకున్నట్లే అంటున్నారు. అయితే దీనిపై కొందరు రజిని ఫ్యాన్స్ స్పందిస్తూ, ప్రస్తుతం దర్బార్ సినిమా విషయమై ప్రచారం అవుతున్న వార్తలను తాము విశ్వసించలేమని, ఎందుకంటే మరొక మూడు రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ విధంగా రూమర్స్ క్రియేట్ చేయడం సహజం అని వారు అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: