స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో . ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ హైదరబాద్ లో గొప్పగా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే . జనవరి 12న ఈచిత్రం విడుదలకానుంది. అయితే దీనికి పోటీగా మహేశ్ బాబు సరిలేరు చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఈ చిత్ర బృందం కూడా హైదరబాద్ లోనే ప్రీ రిలీజ్ ని పూర్తి చేసుకున్నారు.

 

ఇప్పుడు అల్లూ అర్జున్ యూసఫ్ గూడా లోని గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ని ప్లాన్ చేసి తమన్ తో రఫ్ ఆడిస్తున్నాడు ..ఇప్పటికే ఈ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ హీరోయిన్లు అందరూ రావడంతో సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ ఇద్దరూ కలిసి సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అదిరిపోయే రెస్పాన్స్ గ్రౌండ్ లో వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టే రీతిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇవ్వటం జరిగింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ లు స్పష్టంగా ట్రైలర్ లో కనపడటం జరిగాయి.

 

అంతేకాకుండా సినిమాలో బన్నీ డాన్స్ మరియు ఫైట్లు అదరగొట్టే రీతిలో చేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే వచ్చే జనవరి 12వ తారీకున సంక్రాంతి పండుగకు రాబోతున్న ‘అల వైకుంఠపురం లో’ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినిమా ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. సినిమా మొత్తంమీద చూసుకుంటే మ్యూజిక్ పరంగా పాటల విషయంలోనూ బ్యాగ్రౌండ్ విషయంలోనూ దుమ్ము దులిపేశాడు సరికొత్త రీతిలో సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్ అని అంటున్నారు సినిమా ప్రేక్షకులు మరియు అల్లు అర్జున్ అభిమానులు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: