స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కాంబినేషన్ లో  తెరకెక్కిన  మూడో  చిత్రం  అల.. వైకుంఠపురములో ..  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. ప్రమోషన్స్ లో భాగంగా  ఈ రోజు ఈ చిత్రం యొక్క  మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్ గూడలోని  పోలీస్ గ్రౌండ్స్ లో  గ్రాండ్ గా  జరిగింది. ఈ ఈవెంట్ లో  సినిమా  ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.  ఇక ట్రైలర్ లో  అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడు. దానికితోడు  త్రివిక్రమ్  మార్క్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , రిచ్  ప్రొడక్షన్  వాల్యూస్  తో ట్రైలర్ అదరగొట్టింది.
 
ముఖ్యంగా  ట్రైలర్ లో  మూడు డైలాగులు హైలైట్ అయ్యాయి.   అందులో   నిజం చెప్పేటప్పుడే  భయం వేస్తుంది నాన్న చెప్పకపోతే ఎప్పుడు భయమేస్తుంది,  దేన్నైనా పుట్టించే  శక్తి ఇద్దరికే ఉంటుంది  ఒకటి నేలకి రెండు వాళ్లకి అలాంటి వాళ్లతో గొడవలు ఎందుకు సర్ సరెండర్ అయిపోవాలి కానీ,  చివరిది..  గొప్ప  యుద్దాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే  ఈమూడు డైలాగులతో త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ ను చూపించాడు.
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్ గా  నటించగా తమన్ సంగీతం అందించాడు. టబు , జయరాం , మురళి శర్మ , సునీల్ , హర్ష వర్ధన్ , ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం భారీ అంచనాల మధ్య   జనవరి 12న  విడుదలకానుంది.  ఇక  బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు  వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్లు  అయ్యాయి. మరి  అల... వైకుంఠపురములో  వీరికి హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: