పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు. టబు , జయరాం , మురళి శర్మ , సునీల్ , హర్ష వర్ధన్ , ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం భారీ అంచనాల మధ్య జనవరి 12న విడుదలకానుంది. ఇక బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన
జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్లు అయ్యాయి. మరి అల... వైకుంఠపురములో వీరికి హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి.