టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ నిన్న యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించి, సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచడం జరిగింది. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, హరితేజ, శ్రీనివాసరెడ్డి, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, సంగీత తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో అద్భుతంగా జరుగగా, మెగాస్టార్ చిరంజీవి ఆ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు. ఇక ఫంక్షన్ ముగింపు సమయంలో చిరంజీవి మాట్లాడుతూ, నటి విజయశాంతి గురించి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 20కి పైగా సినిమాలు తనతో నటించానని, అయితే ఇద్దరం రాజకీయాల్లోకి చేరిన తరువాత దాదాపుగా 15 ఏళ్ళ తరువాత ప్రస్తుతం సరిలేరు వేదికపైనే కలుసుకుంటున్నాం అని, ఈ విధంగా తమ కలయికకు కారణం అయిన మహేష్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు మెగాస్టార్. ఒకానొక సమయంలో రాజకీయ కారణాలతో విజయశాంతి తనపై విమర్శలు చేసినప్పటికి తాను మాత్రం ఒక్కసారి కూడా ఆమెపై విమర్శించలేదని అన్నారు. 

 

అయితే మెగాస్టార్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన విజయశాంతి, మీరు నన్ను ముందు నుండి అనుండకపోవచ్చును కానీ,  వెనుక నుండి అని ఉండవచ్చు కదా అని అన్నారు. ఇక ఈ విధంగా వారిద్దరి సరదా వాగ్వివాదం పై కొందరు మాత్రం, అబ్బబ్బా మెగాస్టార్ చిరంజీవి గారు, సరిలేరు ఈవెంట్ ని అడ్డంపెట్టుకుని విజయశాంతితో గతం, ప్రస్తుత విషయాలను గుర్తుచేసుకుంటూ ఎంచక్కా వాడుకున్నారని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒకింత వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: