ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ భామ రష్మిక మందన్న, అంతకముందు కన్నడలో కిర్రిక్ పార్టీ అనే సినిమాలో నటించి మంచి పేరు సాధించింది. ఆ తరువాత తెలుగులో ఫస్ట్ మూవీ ఛలో తో తొలి విజయాన్ని అందుకున్న రష్మిక, అనంతరం విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించి మరొక భారీ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, 

 

అల్లు అర్జున్ సుకుమార్ ల కలయికలో తెరకెక్కనున్న సినిమాతో పాటు నితిన్ సరసన భీష్మ సినిమాలో కూడా నటిస్తోంది. కాగా ఆమె మహేష్ బాబు సరసన నటిస్తున్న తాజా సినిమా సరిలేరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, మొన్న హైదరాబాద్ లో ఎంతో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి, సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ మహేష్ తో పాటు సినిమా యూనిట్ కి ముందస్తు అభినందనలు తెలిపారు. అయితే వేడుకకు విచ్చేసిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి కాళ్ళ దగ్గర ఎంతో వినయంగా కూర్చుని, కాసేపు ఆయనతో ఎంతో సరదాగా ముచ్చటించింది రష్మిక మందన్న. 

 

అయితే ఆమె అలా చేయడంపై కొందరు సోషల్ మీడియా వేదికల్లో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ విధంగా మెగాస్టార్ కాళ్ళ దగ్గర కూర్చుని ఆయనను కాకాపడుతూ, ఆయన మెప్పు పొంది, మెగా ఫ్యామిలీ హీరోల సరసన నటించడానికి ఛాన్స్ లు కొట్టేయాలని రష్మిక మంచి ఎత్తు వేసిందని, అలానే ఫంక్షన్ లో రష్మిక గురించి మెగాస్టార్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో, ఆమె ఎత్తు అతి త్వరలో పారేలా ఉందని కూడా అంటున్నారు. మరి ఈ విధంగా పిట్ట కొంచెం అయినా, కూత మాత్రం ఘనం అనే విధంగా రష్మిక తెలివితేటలకు జోహార్లని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: