తెలుగు బుల్లితెర చరిత్రలో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్, మ్యాజిక్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడీ బుల్లితెర హీరో. జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్.. ఇటీవల హీరోగా కూడా అదృష్ణం పరిక్షించుకున్నాడు. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’. రాజశేఖర్రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె. శేఖర్రాజు నిర్మించిన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా సుధీర్ అరెస్ట్ అయ్యాడు. రియల్ ఫేమ్లో కాదండోయ్.. రీల్ ఫేమ్లో.
వివరాల్లోకి వెళ్తే.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సుధీర్కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సుధీర్ ఎప్పుడు సరదాగా నవ్విస్తూ తనపై తానే పంచులు వేసుకోవడం బాగా అలవాటు. అలాంటి సుధీర్ తాజాగా ఓ సంఘటనలో అరెస్టు అయి జబర్దస్త్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆటో రాంప్రసాద్ తో కలిసి బేడీలతో స్టేజీ ప్రవేశించిన సుడిగాలి సుధీర్ ను చూసి జడ్జి రోజా కామెంట్స్ చేయకుండా ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే మీరు చేసిన తప్పులకు ఎప్పుడో ఇలా చూస్తాను అనుకున్నా.. కానీ మరీ ఇంత తొందరగా చూస్తాను అనుకోలేదు..అంటూ రోజా వేసిన పంచ్ దెబ్బకు సుడిగాలి సుధీర్ నోట మాటరాలేక షాక్ ఉండిపోయాడు.
మరోవైపు బేడీలతో సుధీర్ను చూసిన రష్మీ నోట మాటరాకుండా ఉండిపోయింది. అయితే అయితే ఈ మధ్య సుడిగాలి సుధీర్ స్కిట్స్ లో డైలాగ్ పూర్తి కాకముందే జడ్జి రోజా మధ్యలో ఇంప్రువైజ్ చేస్తూ వేసే పంచులు ఎప్పటి లాగే అలరించాయి. దీంతో సుడిగాలి సుధీర్ ఆ విషయాన్ని గమనించి రోజా వైపు చూడటం అందరికీ నవ్వు తెప్పించిందనే చెప్పవచ్చు. వాస్తవానికి సుధీర్ స్కిట్స్ లో డైలాగ్ పూర్తి కాకముందే ఎవరో ఒకరు పంచ్లు వేయడంతో అవి హైలెట్ అవుతూ ఉంటాయి.