కళ్యాణ్ రామ్, మెహ్రీన్‌ కౌర్. జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించిన చిత్రం 'ఎంత మంచివాడవురా'.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, జ‌న‌వ‌రి 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ఇక ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను కూడా పొందింది. ఇదిలా ఉండగా గత సంవత్సరం మార్చిలో '118' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ దాదాపు పది నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు 'ఎంత మంచివాడవురా' అనే సినిమాతో సంక్రాంతి సందర్భంగా వస్తున్నారు.

 

 

ఇకపోతే ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు. బన్ని, అలవైకుంఠపురములో. రజనీ దర్బార్ ఉన్నాయి. కాని గత ఏడాదు. ఇదే సమయానికి పెద్ద హీరోల సినిమాలు విడుదలైనా శతమానంభవతి అనే చిన్న సినిమా పెద్ద హిట్ సాదించింది. ఇక శతమానంభవతి అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న, 'ఎంత మంచివాడవురా' అనే సినిమాకు కూడా దర్శకుడుగా ఉండటం ఒకరకంగా కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రానికి ప్లస్ పాయింటని చెప్పవచ్చూ.

 

 

దానికితోడు 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడితో సినిమా కావడంతో సినిమా పైన జనరల్ గానే భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం లాగే ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ సినిమా దర్శకుడికి మంచి హిట్ అందిస్తుందనే నమ్మకంతో ఈ టీం ఉందని తెలుస్తుంది.

 

 

అంతే కాకుండా నితిన్ హీరోయిగా వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’  సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు కళ్యాణ్ రామ్‌తో కలిసి సతీష్ వేగేశ్న కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడనే వార్త ఆ మద్య గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా వస్తున్న  ఈ క్రేజీ కాంబో క్రేజీ హిట్ సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: