రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరిఉ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీం గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ కనిపిస్తుంది.

 

అయితే ఈ చిత్రం డెభ్బై ఐదు శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. రాజమౌళి కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ అవనుంది. మొదటి నుండి చెబుతున్నట్టుగానే ఈ చిత్రం ఈ సంవత్సరం జులై 30 వ తేదీన విడుదల అవుతుందట. ఇటీవల విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్ మొదలుకావడానికి కొంత సమయం ఉందని తెలుస్తుంది.

 

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ తదుపరి షెడ్యూల్ ప్లాన్ లో ఉన్నారు. తదుపరి షెడ్యూల్ స్టార్ట్ అయ్యే వరకు ఇద్దరు హీరోలు ఏం చేస్తున్నారని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ విరామంలో ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీతో గడపడంతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ నేడు విజయవాడలో సందడి చేశారు. అక్కడ హాప్పీ మొబైల్ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది.

 

ఇక ఎన్టీఆర్ అప్పీ ఫిజ్జ్ వ్యాపార ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు. మరి తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదు. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ చిత్రం మళ్ళీ బాహుబలి లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా లేదా చూడాలి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిసున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: