రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్ళిన మహిళలకు  లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. సొంత వారి నుంచి...గురువుల  నుంచి... ఆకతాయిల నుండి ఇలా ప్రతి ఒక్కరు నుండి మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో మహిళలు ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లాంటి మగాళ్లు  వావివరుసలు మరచి కామంతో మీద పడిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్కడితో ఆగకుండా ప్రాణాలను  సైతం తీసేస్తున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో ఆడపిల్ల బయటకు వెళ్తుంది అంటే మళ్ళీ తిరిగి ఎలా వస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన దిశా ఘటన మరువకముందే మరెన్నో అత్యాచారం హత్య ఘటనలు  తెరమీదికి వస్తూనే ఉన్నాయి. దిశా ఘటనలో  నలుగురు నిందితులను పోలీసులు అతిదారుణంగా ఎన్కౌంటర్ చేసినప్పటికీ కూడా కామాంధుల తీరులో మార్పు రావడంలేదు. యథేచ్ఛగా  అత్యాచారాలు చేసేస్తున్నారు. దిశా ఘటన  తర్వాత తెలంగాణలో ఎన్నో అత్యాచార ఘటనలు తెర మీదికి వచ్చాయి కూడా. ఇకపోతే ఇటీవల కాలంలో పెరిగిన అత్యాచారాలు వేధింపులు ఘటనలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ తాజాగా అమ్మాయిలపై పెరుగుతున్న లైంగిక వేధింపులపై పాజిటివ్ గా  స్పందించి ఆదర్శంగా నిలిచారు. 

 

 హైదరాబాద్ నగరంలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై అసహనాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. హైదరాబాద్ నగరంలో దిశా  అత్యాచారం హత్య ఘటన మరవకముందే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకుని యువతీ  ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురించి తెలుసుకొని తన హృదయం ద్రవించింది అన్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇటువంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: