టాలీవుడ్ లో ఈ మద్య ఇతర భాష హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోయింది.  ముఖ్యంగా మాలీవుడ్ నుంచి వచ్చిన బ్యూటీలు తెలుగు, తమిళంలో తమ జోరు కొనసాగిస్తున్నారు.  ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు అప్పుడప్పుడు మెరిసి పోవడమే కానీ.. దీర్ఘకాలంగా హీరోయిన్లుగా కొనసాగిన దాఖలాలు లేవు. అయితే రకూల్ ప్రీత్ సింగ్ కి తెలుగు లో బాగా కలిసి వచ్చింది.. ఐదేళ్ల నుంచి వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.  ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది. తెలుగులో ఇటీవల నాగార్జున నటించిన మన్మథుడు 2 లో నటించింది.  

 

ఇక ముకుంద, ఒకలైలా కోసం మూవీస్ తో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డే మొదట్లో ఇబ్బందులు పడ్డా అల్లు అర్జున్ నటించిన దువ్వాడజగన్నాథం మూవీలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది.  ఈ మూవీ పూజా హెగ్డేకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.  వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు లో పూజా హెగ్డే వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకుంటుంది.  ప్రస్తుతం త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలా వైకుంఠపురంలో నటిస్తుంది.  ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. పూజ లక్కీ ఛామ్ గా గ్లామర్ ఎలివేషన్ తోనే అవకాశాలు ఒడిసిపట్టుకుంటోంది.

 

 ఇక ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన.  మొదటి సినిమా మంచి హిట్ అందుకున్న తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతా గోవిందం’మూవీలో నటించింది.  ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేయడంతో రష్మికకు బాగా కలిసి వచ్చింది.  ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటిస్తుంది.  ఈ మూవీ మంచి హిట్ అయితే తెలుగు లో కొంత కాలం రష్మికు ఎదురు ఉండదు.  మొత్తానికి ఈ ఏడాది పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఈ ఇద్దరు భామలకు మంచి హిట్స్ వస్తే తెలుగు లో టాప్ హీరోయిన్ల లీస్ట్ లోకి చేరడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: