తెలుగు తమిళ్లో మంచి ఫామ్లో ఉండటమే కాకుండా మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్న హీరో సూపర్ స్టార్ రజిని కాంత్.. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ' దర్బార్ ' .. ఏఆర్ మురగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, నయనతార కథానాయికగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ లో జోరును పెంచేసింది.
అంతేకాకుండా మొన్న ఆమధ్య ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ సందర్బంగా తమిళ తలైవా మాట్లాడిన తెలుగు స్పీచ్ తెలుగు ప్రేక్షకులకు రజినీని మరింత దగ్గర చేశాయి. అదే ఈ సినిమాకు హైప్ ను తీసుకొచ్చింది. ఇది ఇలా ఉండగా అన్నీ కార్యక్రమాలను చక చక చేసుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ముందుగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్లో ‘దర్బార్’ ఫీవర్ మొదలైంది. గతంలో వచ్చిన రజిని పేట సినిమాకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు సెలవు ప్రకటించడమే కాకుండా సినిమా టికెట్ ను కూడా ఇచ్చింది. ఇప్పుడేమో ఓ కంపెనీ ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాదు ఆరోజుకు జీతం ఇవ్వడంతో పాటుగా ఆసినిమా టికెట్లను కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ఆయా ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు . తమిళనాడులో రజిని సినిమా వస్తుందంటే ఆయన ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా నగరంలో ‘దర్బార్’ ప్రదర్శితమయ్యే థియేటర్లలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడానికి అనుమతి ఇవ్వాలని పాప్పారపట్టికి చెందిన కనకరాజ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చెన్నైలో సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలయిన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంది. దీంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.