అల వైకుంఠ‌పుర‌ములో సినిమా కోసం తెలుగునాట ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు . అల్లూ అర్జున్ - బన్నీ ల కాంబినేషన్ మాత్రమే కాకుండా సంక్రాంతి బరిలో మహేశ్ బాబు తో పోటీగా నిలుస్తున్న సినిమా అవ్వడం బాగా కలిసొచ్చే అంశం అనే చెప్పాలి. తమన్ ఇచ్చిన పాటలు ఇప్పటికే ప్రతీ ఇంట్లో తెగ మొగుతున్నాయి. మరో పక్క టీజర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేస్తోంది. ఈ నేపధ్యం లో హైదారాబాద్ లోని మ్యూజికల్ కన్సర్ట్ కి వేలాది మంది జనం ఎగబడ్డం తో ట్రాఫిక్ కూడా స్తంభించింది. మ్యూజికల్ ప్రోగ్రామ్ ఆధ్యంతం తమన్ స్టయిల్ లో గ్రాండ్ గా సాగింది. ఒకప్పుడు సినిమాలకి ఆడియో వేడుకలు చేసేవారు ఆ తరవాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు వచ్చేశాయి వాటిని తలదన్నుతూ బన్నీ కొత్త ట్రెండ్ తో మ్యూజికల్ నైట్ ప్లాన్ చేశాడు.

 

అల్లూ అర్జున్ ఫాన్స్ పోటెత్తడం తో హైదరబాద్ లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ అస్సలు సరిపోలేదు. ఇదే తరుణంలో అంతకుముందు రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో మెగా అభిమానులు మరియు సూపర్ స్టార్ అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ట్రైలర్ కి మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

 

అల వైకుంఠ‌పుర‌ములో సినిమా ట్రైలర్ విషయానికొస్తే ఎప్పటిలాగానే త్రివిక్రం డైలాగులు మార్క్ కనబడింది తప్ప అందులో పెద్దగా కొత్తదనం లేకపోవడంతో...రెండు సినిమాలు ట్రైలర్ లలో 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ట్రైలర్ లో పండించిన కొద్దిపాటి కామెడీ చూసి..జనవరి 11 తేదీ కోసం సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద రెండు టైలర్ల బట్టి చూస్తే సరిలేరు హిట్‌... అల వైకుంఠ‌పుర‌ములో ఫ‌ట్‌ అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: