సూపర్ స్టార్ రజనీకాంత్-నయనతార హీరో హీరోయిన్స్ గా సెన్షేషనల్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ రిలీజ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. మరో 48 గంటల్లో రిలీజ్ కాబట్టి కోలీవుడ్ లో గంట గంట కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లను పూల దండలతో సిద్దం చేస్తున్నారు. ఇక రజనీ ఫ్యాన్స్ థియేటర్ ముందు సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ పొంగల్ కి తమిళనాడు లో రిలీజ్ అవుతోన్న ఒకే ఒక్క స్టార్ హీరో సినిమా కావడం తో అందరి కళ్లు ఈ సినిమా పైనే ఉన్నాయి. దర్బార్ బ్లాక్ బస్టర్ అవుతుందని రజనీ అభిమానులు నమ్మకంగా, ఉత్సాహంగా ఉన్నారు.

 

ఇక ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా దర్బార్ ఫీవర్ నడుస్తోంది. అంతేకాదు చెన్నై సిటీలోని కొన్ని ప్రయివేటు సంస్థలు అయితే ఏకంగా సెలవులను ప్రకటించాయట. మరికొన్ని సంస్థలు సెలవులతో పాటు ఉచితంగా దర్బార్ టిక్కెట్లను పంపిణీ చేసి సూపర్ స్టార్ పై ఉన్న అభిమానం చాటుకున్నాయట. ఇంకా మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు టిక్కెట్లు పంచి పెయిడ్ హాలీడేస్ ని ప్రకటించాయి. సెలవు కావాలంటే ఆ రోజుకి కొంత డబ్బు కడితే ఆ సంస్థనే టిక్కెట్ ఇచ్చి సెలవు ఇస్తుందన్న మాట. మరోవైపు సేలంలోని రజనీ అభిమానులు ఒకడుగు ముందుకేసి దర్బార్ ప్రదర్శించే థియేటర్ల పై హైలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించడానికి వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారట.

 

దానికి సంబంధించి ముందుగానే అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తాజా సమాచారం. గతంలో సూపర్ స్టార్ నటించిన పేట సినిమా విడుదలైనప్పుడు కొన్ని ప్రయివేటు సంస్థలు సినిమా టికెట్లు ఇచ్చి సెలవులు ప్రకటించారు. థియేటర్ సమీపంలో ఉన్న స్కూళ్లకు రద్దీని దృష్టి లో పెట్టుకుని సెలవులు ఇచ్చారు. ఈ క్రేజ్ కేవలం తలైవా సినిమాలకు మాత్రమే సొంతం. అయితే తమిళనాడులో అంత సందడి జరుగుతుంటే తెలుగు నాట మాత్రం అసలు దర్బార్ మాటే లేదు. అయితే కొంతమంది మాత్రం వరుసగా కబాలి, కాలా, పేట సినిమాలు ఫ్లాపయినా జనాలకి రజనీ అంటే ఎంత పిచ్చి అని అనుకుంటున్నారు. అంతేమరి సూపర్ స్టార్ అంటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: