ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి చూపు ఆ రెండు సినిమాల పైనే ఉంది. ఇద్దరు బడా హీరోలు ఒక్క రోజు తేడాతో తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అటు ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతికి రెండు పండగలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇద్దరు తమ సినిమాలను సంక్రాంతి కి విడుదల చేసేందుకు సిద్ధం అయిపోయారు . మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు జనవరి 11వ తేదీన విడుదల కానుండగా... అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతుంది.
దీంతో ఈ ఇద్దరు హీరోల సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఒక్క రోజు తేడాతో విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించి దర్శకులు ఇద్దరూ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించేలా కొన్ని కామెంట్లు చేశారు. ప్రస్తుతం దర్శకుల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ కనిపించబోతున్నారా.. అది తెలియాలంటే సినిమాలోనే చూడండి అంటూ అనిల్ రావిపూడి ఒక మాట అనే సారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఎందుకంటే కంటే విజయశాంతి సినిమా ఎంట్రీ ఫస్ట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కదా ... ప్రస్తుతం రి ఎంట్రీ హీరో కృష్ణ తనయుడు మహేష్ బాబు. దీంతో సరిలేరు నీకెవ్వరు సినిమా పై మరింత హైప్ పెరిగిపోతోంది.
ఇదిలా ఉంటే అటు అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న అల వైకుంఠపురములో సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా... అల్లు అర్జున్ కొడుకు కూతురు అయిన అల్లు అయాన్ అల్లు అర్హ లు వైకుంఠపురములో సినిమాలో కనిపించబోతున్నారు అని చెప్పేసాడు. దీంతో రెండు సినిమాల్లో ఈ రెండు అంశాలకు బాగా హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. దర్శకుడు చెప్పినట్లు సినిమాలో నిజంగానే వీరు ఉండబోతున్నారా.. లేక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చెప్పారా అన్నది కొంతమంది అభిమానులు అనుకుంటే... ఇంకొంతమంది బన్నీ మహేష్ సినిమాllo ఎవరూ ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయని అనుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదల ఎంత వరకు ఆగాల్సిందే మరి.