ఇటీవల  హైదరాబాద్ నగరంలో యూసఫ్ గూడా ప్రాంతంలో పోలీస్ గ్రౌండ్స్ లో ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ కాన్సెర్ట్ అద్భుత రీతిలో జరిగింది. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి పాటలు సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడం తో...అదే వేవ్ తో ఫంక్షన్ ని చాల తెలివిగా త్రివిక్రమ్- బన్నీ చేయించడంతో సగం సినిమా అప్పుడే హిట్ అయిపోయింది అన్న పాజిటివ్ టాక్ ఇప్పుడు బలంగా ఇండస్ట్రీ లో మెగా అభిమానులలో నాటుకుపోయింది. అయితే ఇదే తరుణంలో ఈ సినిమాకి పోటీగా మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవరు’ సినిమా వస్తుందని భావించిన తరుణంలో ఆ సినిమాకి సంబంధించిన పాటల విషయంలో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కి మహేష్ ఫ్యాన్స్ ప్రజెంట్ కొంత నిరుత్సాహ పడుతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి.

 

తమ సినిమాకి పోటీగా ‘అల వైకుంఠపురములో’ వస్తున్న నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన పాటలకు మంచి రెస్పాన్స్ సోషల్ మీడియాలో రావడంతో…’సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి సంబంధించిన పాటల విషయంలో దేవిశ్రీప్రసాద్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందని సినిమా ట్రైలర్ మరియు ఎమోషనల్ సీన్స్ అంతా బాగా ఉన్నాయని మ్యూజిక్ పరంగా దేవిశ్రీప్రసాద్ న్యాయం చేయలేక పోయారని బహిరంగంగానే విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి.

 

ఇందువల్లనే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ఆడియో హిట్ అయి ఉంటే కచ్చితంగా దేవిశ్రీప్రసాద్ హైలెట్ అయ్యేవాడు. పొగిడిందే పొగిడి మహేష్ బాబు తెగ ఇబ్బంది పెట్టేవాడు. కానీ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పరిస్థితి మొత్తం తారుమారైంది. మహేష్ తన స్పీచ్ లో అందరి గురించి చెప్పిన గాని...అసలు ఈవెంట్ హీరో మూలకర్త అయిన దేవి శ్రీ ప్రసాద్ ని మర్చిపోవడం తో ఆ తర్వాత చిరంజీవి స్పీచ్ అయిపోయాక గుర్తు తెచ్చుకొని మహేష్ దేవిశ్రీ గురించి మాట్లాడటంతో...ఏదో మాట్లాడాలి అన్నట్టుగా మహేష్ మాట్లాడినట్లు ఉందని దేవి శ్రీ ప్రసాద్ ఈ విషయమై ఫీల్ అయినట్లు ఇండస్ట్రీ లో వార్తలు చాల గట్టిగా వినబడుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: