మహేష్ కు రజినీకాంత్ కు మధ్య చెప్పుకోతగ్గ వ్యక్తిగత సాన్నిహిత్యం లేదు. అయినా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటిరోజు రికార్డుల కోసం సూపర్ స్టార్ కోలీవుడ్ రజినీకాంత్ పరోక్షంగా టాలీవుడ్ సూపర్ స్టార్ కు సహకరించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి సంక్రాంతి రేస్ విజేత ఎవరు అన్న విషయం తెలియడానికి సంక్రాంతి పండుగ అయితే కాని క్లారిటీ రాని పరిస్థితులలో మహేష్ ఆ రేసు ఫలితం గురించి ఆలోచన పక్కకు పెట్టిన ఇప్పుడు తన ‘సరిలేరు నీకెవ్వరు’ తొలిరోజు కలక్షన్స్ తో నాన్ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈనెల 11వ తారీఖున మన తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఊళ్ళలోను ఒక్క రజినీకాంత్ ‘దర్బార్’ మరి ఏసినిమా ఉండదు అనీ తెలుస్తోంది. 

దీనితో చిన్నపట్టణాలు అన్నింటిలోను 11వ తేదీ ‘సరిలేరు నీకెవ్వరు’ హడావిడి కనిపిస్తుందనీ అంటున్నారు. దీనికితోడు ఈ మూవీ అర్దరాత్రి షోలు 10వ తారీఖు రాత్రి 1గంట నుండి స్పెషల్ షోలు పడేలా చేస్తున్నారు. అంతేకాదు రజినీకాంత్ ‘దర్బార్’ ప్రదర్శిస్తున్న ధియేటర్స్ లో కూడ 10వ తారీఖు అర్దరాత్రి షోలు ‘సరిలేరు నీకేవ్వరు’ కు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 

మూవీ మొదటిరోజు నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయాలి అంటే 40 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావాలి. మహేష్ కు కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప తమినాడు కర్ణాటక కేరళా రాష్ట్రాలలో పెద్దగా ఇమేజ్ లేదు. దీనితో మహేష్ ప్రయత్నిస్తున్నాడు కాని తొలిరోజున తన ‘సరిలేరు నీకెవ్వరు’ తో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడం ఊహించకున్నంత సులువుకాదని అంటున్నారు. దీనితో మహేష్ వ్యూహాలకు చెక్ పెడుతూ తొలిరోజు వసూళ్ళ రికార్డు కోసం ‘అల వైకుంఠపురములో’ మూవీ స్పెషల్ షోలు 12వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుండే మొదలవుతాయి అని తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: