కన్నడ బ్యూటి రష్మిక మందన్న ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత పొరపాటున సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చింది. లేకపోతే పెళ్ళి చేసుకొని ఎక్కడ ఉండేదో. కానీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చాక అసలు పెళ్ళే వద్దనుకొని అయిన ఎంగేజ్ మెంట్ కూడా రద్దు చేసుకుంది. అందుకు కారణం తను ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. యంగ్ హీరో నాగశౌర్య సరసన ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే సక్సస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం తో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అయిపోయింది. అందుకే వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ని దక్కించుకుంది. అయితే తన కెరీర్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది రష్మిక. 

 

తను ఎన్ని సినిమాలు చేసినా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోతుంటాయని, దాంతో మిగతా ఏడాదంతా తను ఖాళీగా ఉన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారని ఫీలవుతోంది. తను మాత్రం సెట్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆడియన్స్ కు మాత్రం దూరమైపోతున్నట్టు అనిపిస్తుందట. 'జనవరి 11 న సరిలేరు నీకెవ్వరు వస్తోంది. ఫిబ్రవరిలో భీష్మ వస్తోంది. నా కెరీర్ ఎప్పుడూ ఇంతే. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు వచ్చేస్తుంటాయి. ఇక మిగిలిన ఏడాదంతా మిగతా సినిమాల పని చేసుకోవడమే. చూసేవాళ్లకు నా సినిమా వచ్చి చాలా రోజులైందేంటి అనిపిస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతుందో ..అంటూ కాస్త వింతగా ఫీలవుతోంది.

 

నితిన్ తో రష్మిక చేస్తున్న భీష్మ సినిమాను డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అదే కనుక జరిగి ఉంటే 2020 మొత్తం తను ఖాళీగా ఉన్నానని, ప్రేక్షకులు అనుకునే ఛాన్స్ ఉందంటోంది రష్మిక. తను కేవలం సినిమాలకు సైన్ చేయడం మాత్రమే చేయగలనని, రిలీజ్ డేట్స్ విషయంలో తను చేయగలిగిందేమి ఉండదని, ఈ విషయంలో తను ఏం చేయలేనంటోంది ఈ కన్నడ బ్యూటీ. ఇక అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ప్రస్తుతం బన్నీతో ఒక సినిమాకు మాత్రమే కమిట్ అయినట్టు తెలిపింది రష్మిక. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత పూర్తిగా బన్నీ-సుకుమార్ సినిమా వర్క్ మీద దృష్టిపెడతానని, ఆ సినిమా తప్ప మరో సినిమా తన చేతిలో లేదని క్లారిటి ఇచ్చింది. అయితే ఇది కొంతమంది దర్శక నిర్మాతలకి తన డేట్స్ ఉన్నాయని ఇన్‌డైరెక్ట్ గా హింట్ ఇస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: