క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ.... ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి మరింత ఎనర్జీ ఇచ్చారు.. ఈ సినిమాని చిత్ర యూనిట్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది.. లేడి అమితాబ్ అయిన విజయశాంతి ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు..
ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది.. ప్రీ రెలీజ్ ఫంక్షన్ హిట్ అవడంతో చిత్ర బృందం ఫుల్ జోష్లో ఉంది. ఈ సందర్భంగా మూవీ టీం ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.బ్లాక్బస్టర్ దిశగా అడుగులు వేస్తూ.. చరిత్ర సృష్టించబోతున్న సరిలేరు నీకెవ్వరు టీంతో గత రాత్రి...
అయితే మా డీవోపీ రత్నవేలును మిస్సవుతున్నాం. మరేం పర్లేదు సర్.. 11న ఇంతకంటే పెద్ద పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత ఫొటోలను షేర్ చేశారు. ఇందులో మహేష్ కుటుంబంతో పాటు... డైరెక్టర్ అనిల్ రావిపూడి, రామజోగయ్య శాస్త్రి, విజయశాంతి, తమన్నా, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్తో పాటుగా మహేష్కు..
మహర్షి వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు.అలానే తమన్నా కూడా పార్టీ లో పాల్గొన్నారు. విజయశాంతి, తమన్నా, రష్మిక, నమ్రత అందరు కలిసి పార్టీ లో పాల్గొని రచ్చ రచ్చ చేసారు. వీళ్ళ ఆనందం ఇపుడే ఇలా ఉంటే సినిమా రెలీజ్ అయ్యాక ఇంకా ఇలా ఉంటుందో. రోజు రోజుకి ఈ చిత్రం మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకులు కూడా సంక్రాంతి పండగ కోసం కాకుండా సినిమా రెలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఈసారి సంక్రాంతి కి అల్లుడు ల కాకుండా మొగుడి ల వస్తున్నాడు