ప్రస్తుతం 2020 సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదన్న విషయం  తెలిసిందే.. ఈ సంక్రాంతికి సినిమాల విందు ఫుల్ గా ఉంది.. అందుకే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.. ఈసారి ఏకంగా నాలు సినిమాలు బరిలో దిగుతున్నాయి.. మహేష్ బాబు , రష్మీక మందన్న హీరో హీరోయిన్లు గా  కలిసి నటిస్తున్న చిత్రం 'సరిలేరూ నీకెవ్వరూ'..   డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.. 

 

సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం విడుదలకు ఎప్పుడెప్పుడా అన్నవిదంగా సిద్దంగా ఉంది.. మహేష్ గత చిత్రం మహర్షి సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. సినిమాలో లేడీ బాస్ విజయ శాంతి , రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ లో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు..ఈ సినిమా ద్వారానే ఈమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందన్న విషయం తెలిసిందే.. 

 

ఇకపోతే యు /ఏ సర్టిఫికెట్ ను అందుకుంది..  ఇప్పటివరకు ఈ సినిమా నుండి బయటకి వచ్చిన టీజర్లు పోస్టర్లు పాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. అందుకే ఈ చిత్రం హిట్ పక్కా అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం నుండి వచ్చిన అన్ని అన్ని సన్నివేశాలకు  మంచి రెస్పాన్స్ ను అందించిన సంగతి తెలిసిందే..

 

 

తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..విజయశాంతి... ఈ వేదికపైనే చిరంజీవి కలుసున్నారు.ఆనాటి జ్ఞాపకాల్ని ఇద్దరు గుర్తు చేసుకున్నారు. దీంతో సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ కు సంబంధించిన వార్తలు ఎక్కడ చూసినా చిరంజీవిమే హైలెట్ అవుతున్నారు. వెబ్ సైట్స్, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ట్రెండ్స్ ఎక్కడా చూసినా... చిరంజీవి వార్తలు, చిరంజీవి కామెంట్స్ మాత్రమే హైలెట్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు ఎక్కడ ట్రెండ్స్‌లో కనిపించలేదు. అంతెందుకు మహేష్ బాబు సొంత యూట్యూబ్ చానల్‌లో కూడా చిరంజీవియే ట్రెండ్ అయ్యారు. దీంతో నమ్రత కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: