స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, సీనియర్ నటి టబు, జయరాం, సముద్ర ఖని, సునీల్, నవదీప్ , రాహుల్ రామకృష్ణ, నివేత పేతురాజ్, సుశాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక మొన్న హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ మ్యూజిక్ కన్సర్ట్ ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. 

 

ఇక ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో పలువురు గాయకులను పిలిపించి సినిమాలోని ఐదు పాటలను ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా తో సహా పాడించి, ఫంక్షన్ కు వచ్చిన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అలవైకుంఠపురములో మూవీ యూనిట్. ఇకపోతే ఈ సినిమాకు సంబందించి ఒక వార్త నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నట్లుగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని బట్టి చూస్తే కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. అయితే ఇదే సినిమాలో ఒక రహస్య విలన్ ఉన్నాడని సమాచారం. గతంలో ఆర్య 2లో బన్నీకి ఫ్రెండ్ గా నటించిన నవదీప్, ఈ సినిమాలో రహస్య విలన్ గా నటిస్తున్నాడట. 

 

మొదట్లో హీరోతో ఎంతో పాజిటివ్ గా ఉండే నవదీప్, సెకండ్ హాఫ్ లో రహస్య విలన్ గా తేలుతాడని సమాచారం. అలానే ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించినట్లు చెప్తున్నారు. అయితే నవదీప్ విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, నవదీప్ కు నటన పరంగా మంచి స్కోప్ ఉన్న ఈ క్యారెక్టర్ అతడి కెరీర్ కు మంచి పునాది వేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ వార్తపై పూర్తి వాస్తవాలు వెల్లడికావలసి ఉంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: