సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ సందడి జనవరి 11 నుండి కాదు 10 నుండే సందడి చేయబోతుంది. సంక్రాంతి బరిలో వస్తున్న సినిమా కావడం ..మహేష్ - అనిల్ కాంబో లో వస్తుండడం తో సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. దీంతో నిర్మాతలు దానిని క్యాష్ చేసుకోవాలని 10 అర్ధరాత్రి నుండే ప్రీమియర్ షోస్ ను భారీగా ప్లాన్ చేసారు

 

ఇలా అయితే 11 మార్నింగ్ షో పడే లోగా కనీసం మూడు షో లు వేసేయవచ్చు. తరవాత నాలుగు షో లు వుంటాయి. లేదా కనీసం టోటల్ గా ఆరు షోలు కచ్చితంగా వుంటాయి. పైగా దర్బార్ ఆడే థియేటర్లలో కూడా అర్థరాత్రి దాటిన తరువాత, తెల్లవారు జామున స్పెషల్ షో లు వేసుకోవచ్చు.

 

మరోపక్క ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డ్స్ బ్రేక్ చేయాలనీ అభిమానులు చూస్తున్నారు. మహర్షి సినిమా కేవలం 26 కోట్లు మాత్రమే రాబట్టడం తో సరిలేరు కలెక్షన్లు దాదాపు 40 వరకు రావాలని అభిమానులు..చిత్ర నిర్మాతలు భావిస్తున్నారుప్రస్తుతానికైతే డే 1 రికార్డు పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' పేరిట ఉంది.

 

ఇదిలా వుంటే సినిమాతో పోటీగా వస్తున్న బన్నీ అల వైకుంఠపురములో మాత్రం 12 తెల్లవారు ఝామున 5 గంటల షో నుంచే ప్రారంభమవుతుంది. మహేష్ సినిమా నిర్మాతలు ఇలా అర్థరాత్రి షో లకు పర్మిషన్ తెచ్చుకోగా హారిక హాసిని క్రియేషన్స్ మేకర్స్ మాత్రం అతి ముఖ్యమైన మొదటి రోజుని గాలికి వదిలేశారని మెగా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: