ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంలో డైరెక్టర్ బి.గోపాల్ తర్వాతే ఎవరైనా. ఒక హీరోను మాస్‌ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే దర్శకుల్లో బి.గోపాల్‌ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లౌ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇక అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా? అంటే టాలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. 

 

బి.గోపాల్ గత కొంతకాలంగా సినిమాలకు సూరంగా ఉంటున్నారు. చెస్తే మళ్ళీ సూపర్ హిట్ సినిమా చేయాలి లేదంటే లేదు అన్న ధోరణిలో సైలెంట్ గా ఉన్నారు. అయితే బాలయ్య 100 సినిమా అప్పుడు కూడా గోపాల్ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. కానీ ఎందుకనో మళ్ళీ ఆ తర్వాత ఆ పేరు వినిపించలేదు. కానీ అప్పుడో ఇప్పుడో బాలయ్య-గోపాల్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందన్న మాట వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే బాలయ్యకి సీనియర్ దర్శకుల మీద మంచి గురి ఉంటుంది కాబట్టి. 

 

ఇక గతంలో బాలయ్య-గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన, 'లారీ డ్రైవర్‌', 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', సినిమాలు బాక్పాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' సినిమాలు టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మరో కొత్త సినిమాకి బాలయ్య సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొన్ని కథలను వింటున్నారట. అలా విన్న వాటిలో ఒక కథ బాలయ్యకు తెగ నచ్చేసిందట. మాస్‌ యాక్షన్‌లో సాగే ఆ కథని తెరకెక్కించడానికి  బి.గోపాల్‌ అయితేనే బావుంటుందని బాలయ్య అనుకుంటున్నారట. ఆయనతో చర్చలు జరిపి త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. 2003లో చివరిసారి 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాకోసం బి.గోపాల్‌-బాలకృష్ణ కలిసి పనిచేశారు. ఇక 2017లో గోపీచంద్‌ కథానాయకుడిగా 'ఆరడగుల బుల్లెట్‌' తెరకెక్కించిన గోపాల్‌ ఆ తర్వాత మరో సినిమా తీయలేదు. మరి బాలయ్య డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కించుకుంటారో లేదో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: