మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు అన్ని పనులని పూర్తి చేసుకుని జనవరి 11 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదల అయిన టిజర్ ట్రైలర్లలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. అనిల్ రావిపుడి సినిమాలన్నీ మాస్ ప్రేక్షకుల అభిరుచుకి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకుల కోసమే.

 

ట్రైలర్ లో కనిపించిన వినోదం.. మాస్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయట. అది జస్ట్ శాంపిల్ మాత్రమే బొమ్మ దద్దరిల్లిపోద్ది అనే మాట నిజం అవబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చిత్ర బృందం కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉందట. అసలేమాత్రం టెన్షన్ కి లోనవ్వట్లేదట. ఔట్ ఫుట్ చూసిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే పూర్తి మాస్ మసాలా చిత్రం కావడంతో ఈ సినిమాని ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ లో వేయాలని భావిస్తున్నారట.

 

సింగిల్ స్క్రీన్స్ లో వేయడం ద్వారా మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవాలని ఈ సినిమాకి ఎక్కువ సింగిల్ స్క్రీన్లు అడుగుతున్నారట. మల్టీప్లెక్సుల ఊసు కూడా తెలియని ఈ ప్రాంతాలలో రెండు థియేటర్లు వుంటే రెండిటిలోను సరిలేరు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయట. ఫిక్స్‌డ్‌ హైర్లు కూడా భారీ స్థాయిలో ఆఫర్‌ చేస్తున్నారట. పల్లెటూళ్ళు, పట్టణాలలోని థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు సినిమాని ప్రదర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట.

 

 


మరి ఈ విధంగా చేస్తే అల వైకుంఠపురములో సినిమాకి థియేటర్ల సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.  సరిలేరు సినిమాకి మంచి టాక్ వస్తే అల వైకుంఠపురములో సినిమాకి థియేటర్లు ఎక్కువగా దొరికే ఛాన్స్ తక్కువ. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: