దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఉమైర్ సంధు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఇచ్చే రివ్యూల పైన రేటింగ్స్ పైనా టాప్ హీరోల అభిమానులతో పాటు ఆ భారీ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు హీరోలకు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల విడుదలకు ఇక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఇంకా ఉమైర్ సంధు ఈ మూవీల పై ఎటువంటి రేటింగ్స్ ఇవ్వక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

వాస్తవానికి దుబాయ్ సెన్సార్ నియమ నిబంధనల ప్రకారం ఒక సినిమా వారి దేశంలో విడుదల కావాలి అంటే ఆ మూవీని ఖచ్చితంగా వారం రోజులు ముందుగా సెన్సార్ చేయించి తీరాలి. అయితే ‘అల’ ‘సరిలేరు’ మూవీల విషయంలో ఇప్పటికే దుబాయ్ సెన్సారింగ్ కార్యక్రమాలు పూర్తి అయినా చాల వ్యూహాత్మకంగా ఈ మూవీలకు సంబంధించిన దుబాయ్ టాక్ ను బయటకు రానీయకుండా ఈ మూవీల నిర్మాతలు చాల జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు మూవీలను ఇప్పటికే చూసిన ఉమైర్ సంధు ఈ మూవీల పై తన స్పందనను రేటింగ్స్ ను తెలపకుండా ఉండటానికి అతడికి భారీ మొత్తాలు ఆఫర్ చేసారు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఈ రెండు సినిమాలను ఇప్పటికే చూసిన ఉమైర్ ఒక సినిమాకు మంచి మంచి రేటింగ్స్ ఇచ్చి మరొక సినిమాకు ఒక మోస్తరు రేటింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు టాక్. ఇది ఇలా ఉంటే ఉమైర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న అమెరికాలోని కొన్ని తెలుగు మీడియా సంస్థలు ఉమైర్ ను కాంటాక్ట్ చేసి ఈ రెండు సినిమాలలో ఏది బాగుంది ఏది ఒక మోస్తరు అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఉమైర్ వ్యూహాత్మకంగా అందుబాటులోకి రావడం లేదు అని అన్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: