‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ఎవర్నీ  పిలవకపోయినా అన్నీ తానై నడిపించాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ మూవీకి ఏర్పడ్డ క్రేజ్ తో ఈ మూవీ ద్వారా బన్నీ కోరుకున్న భారీగా కలక్షన్స్ రావాలి అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల సపోర్ట్ సరిపోదు. 

దీనితో ఈ సినిమాను అల్లు అర్జున్ కు మంచి పట్టు ఉన్న కేరళా రాష్ట్రంలో కూడ మళయాళ భాషలోకి డబ్ చేసి ‘అంగు వైకుంతపురతు’ పేరుతో జనవరి 12న అక్కడ కూడ విడుదల చేస్తున్నారు. మళయాళ యూత్ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. గతంలో ఇతడు నటించిన చాల సినిమాలు కేరళా రాష్ట్రంలో కూడ సక్సస్ అయ్యాయి. 

అయితే గత కొంత కాలంగా బన్నీ క్రేజ్ కేరళలో తగ్గింది. దీనికి కారణం అక్కడ దూసుకు వస్తున్న మళయాళ యంగ్ హీరోలు వారు కూడ బన్నీ స్థాయిలో స్టెప్స్ వేస్తున్న నేపధ్యంలో బన్నీ పై మ్యానియా బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులలో తాను పోగొట్టుకున్న క్రేజ్ ను తిరిగి రాబట్టుకోవడానికి బన్నీ తన మూవీ మళయాళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కేరళాలోని త్రివేండ్రం లో కూడ ఎల్లుండి భారీ స్థాయిలో చేయబోతున్నారు. 

ఈ ఫంక్షన్ కు మోహన్ లాల్ అతిధిగా రాబోతున్న నేపధ్యంలో ఆఫంక్షన్ వార్తలు మళయాళ మీడియాలో కూడ ప్రముఖంగా వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు కేరళ ప్రాంతంలో మంచి స్పందన రావడంతో అక్కడ కూడ ఈ మూవీని భారీగా ప్రమోట్ చేసి తన మూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడానికి అల్లు అర్జున్ చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బన్నీ సినిమాలకు తమిళనాడు ప్రాంతంలో పెద్దగా క్రేజ్ లేదు. దీనితో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీని తమిళంలోకి కూడ డబ్ చేసి విడుదల చేసే ఆలోచనలు బన్నీకి ఉన్నాయని టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: