ఖైదీ నెంబర్ 150,
సైరా తరువాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం
సక్సెస్ ఫుల్ డైరెక్టర్
కొరటాల శివ తో తన 152 వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా ఈ చిత్రం కోసం కోకాపేట లో ప్రత్యేకంగా వేసిన మిడిల్ క్లాస్ కాలనీ సెట్ లో ఓ పాట తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో యంగ్
హీరోయిన్ రెజీనా కాసాండ్రా చిరు తో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది.
ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్
రామ్ చరణ్ కూడా నటించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఫిలిం
నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం
చరణ్ ఈచిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. 30రోజులు ఈచిత్రం కోసం తన డేట్స్ కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం
చరణ్ , రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్
ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు . ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ కాగా మార్చి వరకు మొత్తం పూర్తి కానుంది. ఆతరువాత ఏప్రిల్ నుండి
చరణ్ ,చిరు 152 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
సీనియర్ మ్యూజిక్
డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో త్రిష కథానాయికగా నటించనుంది. సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్లను తెరకెక్కిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ వస్తున్న
కొరటాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే ఫార్ములా తో తెరకెక్కిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ,
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్
రెడ్డి,
రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్నిఈఏడాది ఆగస్టు 14న ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు.