స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సంక్రాంతి బరిలోకి దిగేందుకు జనవరి 12 థియేటర్లలోకి రాబోతోంది అల వైకుంఠపుములో.
ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది యూనిట్. ఇదిలా ఉంటే.. తాజాగా మెగా అభిమానుల మాట మారింది.. అది నిన్నటి వరకు ఇప్పుడు మెగా అభిమానులు వేరు, అల్లు అర్జున్ అభిమానులు వేరట. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్నే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అయ్యారు. అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ నిమిత్తం, అల్లు అర్జున్ అండ్ టీమ్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళితే, అక్కడ తొలిసారిగా అల్లు అర్జున్ ఆర్మీ హంగామా కన్పించింది. ఇప్పుడు ఈ ఆర్మీ అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సెర్ట్ సందర్భంగా కూడా మరోమారు హంగామా చేసింది.
ఈ ఈవెంట్లో బన్నీ మాటలు కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఇలా మెగా కాంపౌండ్ లో కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ రెండుగా చీలిపోతున్నారు. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఎవరికి వారు సెపరేట్ గా ఉంటున్నారు. కాగా, డిఫరెంట్ జానర్లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నిరాశపరచటంతో అల వైకుంఠపురములో సినిమాను పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, నవదీప్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ ఫ్యాన్స్ ఫైట్లో అల వైకుంఠపురములో చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.