టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు, ప్రతి ఏడాది అక్కడక్కడా కొన్ని ఫ్లాప్స్ ఇస్తున్నప్పటికీ, మెజారిటీ మాత్రం తన బ్యానర్ నుండి మంచి హిట్స్ మాత్రం ఇస్తూనే కొనసాగుతున్నారు. గత ఏడాది ఆయన బ్యానర్ నుండి వచ్చిన ఎఫ్2, మహర్షి సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి, రాజు బ్యానర్ కు ఉన్న పేరుని మరింతగా పెంచాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన బ్యానర్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు రానుండగా, శర్వానంద్ సమంతల కలయికలో కూడా మరొక సినిమా రూపొందుతోంది. కాగా ఆ సినిమాకు నిన్న జాను అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసింది సినిమా యూనిట్.  ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయిన 96 మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ మూవీ ని తీసిన సి ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించడం విశేషం. 

 

96లో త్రిష, విజయ్ సేతుపతి తమ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసారు. ఇక తెలుగులో వారిద్దరి పాత్రల్లో శర్వానంద్, సమంత అక్కినేని నటిస్తుండగా గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక మరోవైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే 96 రీమేక్ కు జాను అనే టైటిల్ పెట్టడం ప్రస్తుతుం ప్రభాస్ మూవీ యూనిట్ కు పెద్ద సమస్యగా మారింది. నిజానికి ప్రభాస్

 

పూజ నటిస్తున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా జాన్ అని ఎప్పుడో అనుకున్నారు. కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబందించిన న్యూస్ మొత్తం కూడా జాన్ పేరుతోనే బయటకు వస్తోంది. ఇక ప్రస్తుతం అర్ధాంతరంగా 96 రీమేక్ కు జాను అంటూ టైటిల్ పెట్టడం, అలానే అది జాన్ కు ఎంతో దగ్గరగా ఉండడంతో, ఆడియన్స్ కొంత కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని జాన్ సినిమా యూనిట్ ఆలోచిస్తున్నారట. కాగా అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభాస్ మూవీ టైటిల్ ని మార్చే పనిలో పడిందట సినిమా యూనిట్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు మాత్రం వెల్లడికావలసి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: