టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తర్వాత.. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం ప్రమోషన్స్లో కూడా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఆదివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సరిలేరు ప్రి రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. క్రేజీ కాంబినేషన్ కావడం వల్ల మరియు పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 77.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 101.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. కాగా, రాజేంద్ర ప్రసాద్, కాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరో విషయం ఏంటంటే.. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్లో అంత వేగంగా పూర్తైన సినిమా ఇదే. ఈ సినిమాతో మహేశ్ బాబు కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి మహేష్ బాబు ఆ నమ్మకాలను ఒమ్ము చేస్తాడో.. లేదో.. చూడాలి.