టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ 26వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజైన ట్రైలర్ చూస్తే ప్రతి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు సినిమా పక్కా హిట్టు అనే కాన్ ఫిడెన్స్ వచ్చింది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు అనీల్ రావిపుడి వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్ అనిపించుకునేలా ఉన్నాడు.

 

అయితే పటాస్ నుండి ఎఫ్-2 వరకు అనీల్ రావిపుడి సక్సెస్ వెనుక ఉన్న ముగ్గురు వ్యక్తుల గురించి లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. వాళ్లెవరు అంటే అనీల్ చేసిన ప్రతి సినిమాకు తనతో పనిచేసిన సాయి కృష్ణ.. అనీల్ కు కుడి భుజం లాంటి వ్యక్తని తెలుస్తుంది. కో రైటర్ గా సాయి కృష్ణ అనీల్ కు బాగా హెల్ప్ అవుతాడని తెలుస్తుంది. ఇక నారాయణ, ప్రవీణ్ అనే మరో ఇద్దరు రైటర్స్ కూడా స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేస్తారట. తన ముగ్గురు టీం తోనే అనీల్ ఇలా వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. 

 

అనీల్ రావిపుడి సినిమా కథలు రొటీన్ గా అనిపించినా కామెడీ.. ఎమోషన్.. ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలు పక్కాగా ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా తన సత్తా చాటేలా ఉన్నాడు అనీల్ రావిపుడి. సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా ఉందని తెలుస్తుంది. ఈ శనివారం రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు అనీల్ రావిపూడి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: