సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి, సినిమా యూనిట్ కు అలానే హీరో మహేష్ బాబుకు సినిమా హిట్ కావాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు. ఇక ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడిన చిరంజీవి, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు దక్కవలసిన గుర్తింపు దక్కలేదని, కావున ఇకనైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయమై జోక్యం చేసుకుని ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వలసిందిగా తన తరపున అభ్యర్దిస్తున్నట్లు కోరారు. 

 

అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకలో అర్జున్ మాట్లాడుతూ, తనకు జన్మకు కారకుడైన తన తండ్రి అరవింద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, దాదాపుగా నలభై ఏళ్లుగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక సంస్థ అధినేతగా సినిమాలు నిర్మిస్తూ తనవంతుగా టాలీవుడ్ కి సేవలు అందిస్తున్నారని, కావున ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇస్తే బాగుంటుందని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరడం జరిగింది. 

 

ఇకపోతే నేడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరుగనున్న నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉందని కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. వాస్తవానికి కొన్నేళ్ల నుండి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం కోరుతుండడంతో, నేడు జరుగనున్న ఈ సినిమా వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, ఆయన తాతగారికి ఆ అవార్డు ప్రకటించాలని కోరే అవకాశం ఉందట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మాత్రం నేటి రాత్రి వరకు వేచిచూడాల్సిందే....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: