కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దర్బార్. మంచి సోషల్ మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్, ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా బాగానే బిజినెస్ చేసినట్లు సమాచారం. 

 

ఇక ద‌ర్బార్ సినిమా తెలుగు రైట్స్ ని ఒక ప్రముఖ నిర్మాత14 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. రెండు రాష్ర్టాల రిలీజ్ హక్కులు ఎంతో పోటీ నడుమ పలువురు పోటీ దారులను ఎదుర్కొని సదరు నిర్మాత ఈ హక్కులను దక్కించుకున్నారట. ఈ నేపథ్యంలో నిర్మాత ఒకింత ఎక్కువగానే దీనిపై పెట్టుబడి పెట్టారని ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత కొన్నేళ్లగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమాలు ఇక్కడ పెద్దగా సక్సెస్ అవ్వడం లేదనే చెప్పాలి. భారీ ధరకు రైట్స్ అయితే అమ్ముడుపోతున్నాయిగానీ, రిటర్న్స్ అయితే ఆశించిన స్థాయిలో రావడం లేదని కొందరు బయ్యర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. 

 

వాస్తవానికి రజిని నటించిన కొచ్చాడయన్ దగ్గర నుంచి మొన్నటి పేట వరకూ ఏ సినిమా కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక పోయింది. మరి దర్బార్ వాటిని బ్రేక్ చేసి ముందుకెళ్లాల్సి ఉంది. తొలి షోతోనే బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే సూపర్ స్టార్ క్రేజ్ తో అసాధారణ వసూళ్ల వైపు పరుగులు పెట్టడం ఖాయం. తర్వాతి రెండు రోజుల గ్యాప్ లో వచ్చే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల పోటీని కూడా తట్టుకుని నిలబడగలిగాలి. లేకుంటే ఖేల్ ఖ‌త‌మే అని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. మరి రజిని ఈసారి తన మ్యాజిక్ తో ఎంతవరకు సక్సెస్ సాధించి కలెక్షన్స్ రాబడతారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: