సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్గెస్ట్ సూపర్ హిట్ మహర్షి సినిమా తర్వాత అదిరిపోయే సినిమా ఏది అంటే సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా ఈ సంక్రాంతికి సూపర్ గిఫ్ట్ గా మన ముందుకు వస్తుంది. అయితే ఈ సూపర్ గిఫ్ట్ కు సంబంధించి ఈరోజు మరో సూపర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ చూస్తే ఎవరపైన సరే సూపర్ అనాల్సిందే.. 

 

లేడీ అమితాబ్ విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది. మహేశ్‌ బాబు సైనికుడి పాత్ర పోషించిన ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో రాజకీయాలను రంగరించి దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో విజయశాంతి రాజకీయ నాయకురాలిగా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. కాకపోతే ఈ సినిమాకు రెండు రోజులు ముందే అంటే 9వ తారీకు రేపే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత సినిమా దర్బార్ రిలీజ్ కానుంది. 

 

దర్బార్ సినిమా మినహా మరొకటి థియేటర్లలో 11 నాటికి వుండదు. అందుకే 10 అర్థరాత్రి దాటిన తరువాత నుంచే షో లు పడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా అయితే 11న మార్నింగ్ షో పడే లోగా కనీసం మూడు షో లు వేసేయవచ్చు. ఆ తరవాత నాలుగు షో లు వుంటాయి. లేదా కనీసం టోటల్ గా ఆరు షోలు కచ్చితంగా వుంటాయి. 

 

డే వన్ నాన్ బాహుబలి రికార్డు రావాలంటే 40 కోట్లకు పైగా వసూళ్లు రావాలి. మహర్షికి వచ్చింది 26 కోట్లకు పైగానే. మహేష్ కు వేరే భాషలు, రాష్ట్రాల మార్కెట్ అంతగా లేదు. లేదూ అంటే సైరా, సాహో మాదిరిగా రికార్డులు వచ్చేవి. ఇప్పుడు ఆ లోటు పూడ్చడానికి మాగ్జిమమ్ థియేటర్లు, మాగ్జిమమ్ షోలు వరల్డ్ వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సరిలేరు నీకెవ్వరూ అయిన నాన్ బాహుబలి రికార్డ్స్ సాధిస్తుంది ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: