ఈ మద్య సినీ పరిశ్రమలో డేటీంగ్ కల్చర్ సర్వ సాధారణం అయ్యింది.  ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం అయిన ఈ సాంప్రదాయం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలకు కూడా పాకింది. సెలబ్రెటీలే కాదు.. కామన్ పీపుల్స్ కూడా డేటింగ్ అనేది ఓ ఫ్యాషన్ అయ్యింది.  ఇష్టమున్నంత కాలం కలిసి ఉండటం.. తేడా వస్తే విడిపోవడం డేటీంగ్ సాంప్రదాయం.  తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో ఓ హీరోయిన్ చేసిన ఘనకార్యానికి ఆమె కుటుంబ సభ్యులు కష్టాల్లో పడ్డారు. కన్నడ చిత్ర సీమలో కలకలం రేగింది. ఒక హీరోయిన్ దర్శకుడితో వెళ్ళిపోయిన ఘటన అక్కడ కలకలం రేపుతుంది.  దాదాపు 15 సినిమాలకు పైగానే ఆమె నటించారు.

 

ఇటీవల ఒక దర్శకుడి తో ఆమె ప్రేమలో పడింది. అజినప్ప అనే దర్శకుడితో కొన్ని రోజుల క్రితం ఆమె ఎక్కడికో వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగి౦చింది.  అయితే, తమ కుమార్తెను అతడు కిడ్నాప్ చేశాడంటూ విజయలక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనేది మాత్రం ఇప్పటి వరకు ఏ సమాచారం లేదు. షూటింగ్ అంటూ కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ఆ హీరోయిన్ చివరకు అమ్మమ్మ చనిపోయినా కూడా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీనితో ఆమె తల్లి కూడా అనారోగ్యంతో మంచాన పడింది.

 

ఇప్పుడే ఆ తల్లికి మరో కష్టం వచ్చి పడింది. ఆమె సినిమాలు చేయడానికి గాను, కొందరు నిర్మాతల వద్ద అడ్వాన్సు లు తీసుకుంది. ఆ సినిమాలకు ఆమె సంతకాలు కూడా చేసింది. కాని ఆమె కనపడకపోవడంతో ఆ నిర్మాతలు ఆమె ఇంటికి వచ్చి తల్లిని నిలదీస్తున్నారు. ఇప్పుడు తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని ఆమె తల్లి మీద ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక విజయలక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని వేడుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: