డైరెక్టర్ మారుతి అనగానే చిన్న సినిమాలకు ప్రాణం పోసిన శిల్పి లాంటి దర్శకుడు అని అనిపించక తప్పదు. ఎందుకంటే మొదటిసారిగా ఆయన దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమా ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే.. ఆ తర్వాత వచ్చిన బస్టాప్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. కానీ ఇలాంటి సినిమాలతో బూతు సినిమాల దర్శకుడిగా పలువురి నుండి విమర్శలు కూడా అందుకున్నాడు. ఏది ఏమైనా చిన్న సినిమాలు కనుమరుగు అవుతున్న సమయంలో వాటికి ప్రాణం పోసింది ఈయనే..

 

 

ఇకపోతే అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మారుతి ఇప్పుడు అసాధ్యుడిగా మారిపోయాడు తన ప్రయాణం ఈ రోజుల్లో అంటూ మొదలుపెట్టిన మారుతి. దానికి ముందు పోస్టర్ డిజైనింగ్స్, మల్టీమీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్నాడు. ఇకపోతే ప్రేమకథా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మారుతి, ఈ చిత్రం నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన భలేభలే మగాడివోయ్ సినిమాతో తన రేంజ్ మరింతగా పెంచుకున్నాడు.. ఆ వెంటనే వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం కాస్త దెబ్బతిన్నా కూడా మహానుభావుడు సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు.

 

 

కానీ తర్వాత వచ్చిన మూవీ శైలజారెడ్డి అల్లుడు.. ఇది అంచనాలు తప్పినా కూడా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతిరోజూ పండగ చిత్రంతో పెద్ద హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ప్రతిరోజూ పండగ నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కన్నా సుమారుగా 10 కోట్లకు పైగా లాభాలు సాధించిందట.

 

 

ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ తోనే రన్ అవుతుంది. ఇక సినిమా మంచి హిట్టు కావడంతో యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, విక్కీ, ప్రమోద్ కలిసి రేంజ్ రోవర్ వెలార్ కారును మారుతికి బహుకరించారు. అంతకుముందు భలే భలే మగాడివోయ్ సినిమా కూడా మంచి హిట్టు కావడంతో యువీ క్రియేషన్స్ వారే జాగ్వార్ కారును మారుతికి బహుమతిగా అందించారు. నిజంగా డబుల్ దమాఖ లక్కు అంటే మారుతిదే అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: