అల్లుఅర్జున్ కధానాయకుడిగా పూజ హెగ్డే కధానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆలా వైకుంఠపురములో. ఇప్పటికే విడుదలైన పాటలు.. టీజర్, ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది. బన్నీ అభిమానులు కూడా ఇప్పటికే ఈ సినిమాపై తారాస్థాయిలో నమ్మకం పెట్టేసుకున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంత్రి సందర్భంగా ఈ నెల 12న రిలీజ్ కానుంది. 

 

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కలిసి తీసిన మూడో సినిమా ఈ అలవైకుంఠపురములో. మొదట తీసిన జులాయి సినిమా ఇప్పుడు చుసిన సూపర్ అనిపించేస్తుంది... అద్భుతం అనిపిస్తుంది.. మరోసారి చూడాలి అనిపిస్తుంది. అందుకే అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

 

అయితే అంత సూపర్ హిట్ చిత్రం తరవాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మళ్ళి బన్నీనే హీరోగా తండ్రి విలువ.. విలువల గురించి.. బంధుత్వాల గురించి ప్రేక్షకులకు టచ్ అయ్యే విధంగా తీసి 2015 సమ్మర్ లో సూపర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. అలాంటి సూపర్ హిట్ చిత్ర తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఈ అల వైకుంఠపురములో.. ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ అయినట్టే. 

 

అయితే చెప్పాలంటే..ఇది ఒక రకంగా వాళ్ళ కల కూడా.. బన్నీకి ఏమో మూడేళ్ళ నుండి హిట్ లేదు.. త్రివిక్రమ్ కు హిట్ ఉన్న సరే అర్జున్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలనుకుంటున్నారు.. కానీ కథ.. సీన్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ లా కనిపిస్తున్నాయి. జులాయి సినిమాలో కాస్త.. సన్ అఫ్ సత్యమూర్తిలో కొంత.. అత్తారింటికి దారేదిలో కొంత.. ఇన్ని కాంతలు కనిపిస్తున్న ఈ సినిమా హిట్ అయ్యేనా.. బ్లాక్ బస్టర్ కొట్టేనా.. వీరి కల తీరేనా.. దేవుడికే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: