మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు అన్ని పనులని పూర్తి చేసుకుని జనవరి 11 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదల అయిన టిజర్ ట్రైలర్లలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరొక పక్క అల్లూ అర్జున్ అల వైకుంఠపురములో కూడా 12 కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా లు రెండూ పండగ కి హడావిడి చేయనున్న ఈ తరుణం లో దర్బార్ సినిమా కూడా వచ్చేసింది. ఈ మూడు సినిమా లకీ ఒక చిన్న సినిమా పోటీ ఇస్తోంది. కల్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచి వాడవురా చిత్రం విడుదల కి సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసం గా జరిగింది .
ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టిఆర్ ముఖ్య అతిధి గా వచ్చారు .. ఆయన మాటలు అందరినీ మెప్పించాయి. అయితే నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఫంక్షన్ లో ఉంటే బాగుండేది అని చాలామంది వాపోతున్నారు. ఒకేసారి స్టేజీ మీద ముగ్గురునీ చూడాలి అని కోరుకున్న నందమూరి ఫాన్స్ కి నిరాశ ఎదురైంది. నందమూరి , నారా కుటుంబం వారు ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఎంతోమంది సపోర్ట్ ఎన్టిఆర్ కీ కల్యాణ్ రామ్ కి ఉంది అని నిరూపిస్తూ వేలాది మంది జనం ఇవాళ ఎగబడ్డారు .. ఎన్టిఆర్ ని కల్యాణ్ రామ్ ని చంద్రబాబు - బాలయ్య అవసరానికి వాడుకుని వదిలేస్తారన్న అపవాదు ఉంది.
హరికృష్ణ మృతి తర్వాత హడావిడి చేసినా తర్వాత మళ్లీ దూరం పెట్టారని టాక్.. ఇప్పుడు ఈ సినిమా వస్తుందంటే బాలయ్య స్వయంగా రావాలి.. ఎన్ని పనులు ఉన్నా రావాలి .. కానీ రాలేదు... కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యాణ్ను ఎవరు పట్టించుకోకపోయినా కోట్లాది మంది తెలుగు అభిమానులు పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా సపోర్ట్ చేస్తున్నారు. అది ఈ రోజు ఫంక్షన్లో కూడా చక్కగా కనపడింది .