నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచి వాడవురా సినిమా' యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగానే ఆ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన నటాషా దోషి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఆయనతో తనకు ఒక సెల్ఫీ కావాలని కోరింది. కోరిన వెంటనే ఎన్టీఆర్ కూడా ఆమెకు ఫోటో ఇచ్చేయగా ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో కూడా ఈ అమ్మడు కలిసి ఫోటో దిగింది.
ఇంతకీ ఈ నటాషా దోషి కి బాలయ్య కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మొన్న ఈ మధ్యనే బాలయ్య నటించిన 'రూరల్' చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్.రవికుమార్ తోనే బాలయ్య ఇంతకుముందు 'జైసింహ' అని ఒక హిట్ చిత్రం తీశాడు. ఆ సినిమాలో నటాషా దోషి కూడా ఒక హీరోయిన్ కావడం విశేషం.
సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. "మా నందమూరి అభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ముందుగా ఆదిత్య మ్యూజిక్ వారి స్వాగతం పలుకుతున్నా. ఈ చిత్రంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. జనవరి 15న మన సినిమా వస్తుంది. సంక్రాంతి అంటే సినిమా పండుగ.. 9న దర్బార్, 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో మూవీ విడుదల కానున్నాయి. ఈ సంక్రాంతి సినిమాలన్నీ విజయవంతం కావాలని కోరుతున్నా" అని అన్నాడు.