నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచి వాడవురా సినిమా' యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. సందర్భంగానే చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన నటాషా దోషి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఆయనతో తనకు ఒక సెల్ఫీ కావాలని కోరింది. కోరిన వెంటనే ఎన్టీఆర్ కూడా ఆమెకు ఫోటో ఇచ్చేయగా తర్వాత కళ్యాణ్ రామ్ తో కూడా అమ్మడు కలిసి ఫోటో దిగింది.

 

ఇంతకీ నటాషా దోషి కి బాలయ్య కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మొన్న మధ్యనే బాలయ్య నటించిన 'రూరల్' చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్.రవికుమార్ తోనే బాలయ్య ఇంతకుముందు 'జైసింహ' అని ఒక హిట్ చిత్రం తీశాడు. సినిమాలో నటాషా దోషి కూడా ఒక హీరోయిన్ కావడం విశేషం.

 

సంక్రాంతి కానుకగా ఈనెల 15 ప్రేక్షకుల ముందుకు రానుంది సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. "మా నందమూరి అభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ముందుగా ఆదిత్య మ్యూజిక్ వారి స్వాగతం పలుకుతున్నా. చిత్రంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. జనవరి 15 మన సినిమా వస్తుంది. సంక్రాంతి అంటే సినిమా పండుగ.. 9 దర్బార్, 11 సరిలేరు నీకెవ్వరు, 12 అల వైకుంఠపురములో మూవీ విడుదల కానున్నాయి. సంక్రాంతి సినిమాలన్నీ విజయవంతం కావాలని కోరుతున్నా" అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: