కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎంత మంచివాడవురా సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్సినిమా గురించి అన్న కళ్యాణ్ రామ్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.  కళ్యాణ్ రామ్ అన్ని రకాల సినిమల్లో నటించారని, అయితే, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించలేదని అన్నారు.  


కళ్యాణ్ అలాంటి సినిమాల్లో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అని ఆ కల ఇప్పటికి నెరవేరినట్టు ఎన్టీఆర్ పేర్కొన్నారు.  కళ్యాణ్ ఈ సినిమాలో సూపర్ యాక్టింగ్ చేశారు.  సినిమా విషయంలో పర్ఫెక్ట్ గా నటించారు.  సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ్రీన్ నటించింది.  వేగేశ్న సతీష్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.  


కళ్యాణ్ రామ్ చేసిన అతనొక్కడే, పటాస్, 118 సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  కళ్యాణ్ సొంత బ్యానర్లోనే ఎక్కువ సినిమాలు చేశారు.  కాగా, ఇప్పుడు బయట బ్యానర్లో సినిమాలు చేస్తున్నారు.  118 సినిమా బయట బ్యానర్లో చేసిందే.  ఇప్పుడు ఈ సినిమా కూడా బయట బ్యానర్లో చేయడం విశేషం.  ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమా చేశారు.  


సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు మంచి లాభాలు వచ్చాయి.  ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్నకు ఫ్రీగా సినిమా చేసిపెట్టి బ్యానర్ ను నష్టాల నుంచి బయటపడేశాడు.  అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది.  తండ్రి హరికృష్ణ మరణం తరువాత ఈ ఇద్దరి మధ్య బాండ్ మరింతగా బలపడింది.  దీనిని ఇలానే కంటిన్యూ చేసుకుంటున్నారు.  అయితే, ఈ వేడుకకు బాలయ్య కూడా వస్తారని అనుకున్నారు.  కానీ, కొన్ని కారణాల వలన రాలేకపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: