బుల్లితెరపై ప్రసారం అవుతున్న క్రేజీ షో జబర్దస్త్ లో మంచి పేరుతో దూసుకుపోతున్న నటుల్లో హైపర్ ఆది కూడా ఒకడు. కొన్నేళ్ల  క్రితం ప్రారంభం అయిన ఆ షోలో మొదట చిన్న పార్టిసిపెంట్ గా తన కెరీర్ ని ఆరంభించిన ఆది, మెల్లగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి పేరు దక్కించుకోవడం జరిగింది. తరువాత కొన్నాళ్ళకు జబర్దస్త్ షోలో హైపర్ ఆది పేరుతో ఒక టీమ్ ని కూడా క్రియేట్ చేసుకున్న ఆది, అక్కడి నుండి మరింతగా తన పేరును పెంచుకుంటూ ముందుకు దూసుకుపోయాడు. ఇక ఆది స్కిట్స్ కు క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని ఒక్కో స్కిట్ కు ఈటివి ఛానల్ తో పాటు యూటుబ్ లో కూడా భారీ స్థాయిలో రేటింగ్స్, వ్యూస్ వస్తుంటాయి. ఇక స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన ఆది

 

తనకు అవకాశం దొరికినపుడల్లా పవన్ ఫ్యాన్స్ ని కలుస్తుండడంతో పాటు ఆ మధ్య ఎలక్షన్ సమయంలో జనసేన పార్టీ తరపున ప్రచారం కూడా చేయడం జరిగింది. అయితే కేవలం పవన్ మాత్రమే కాక, జబర్దస్త్ షోలో తన ఎదుగుదలకు ఎంతో మద్దతిచ్చిన మెగాబ్రదర్ నాగబాబు అంటే కూడా మొదటి నుండి ఆదికి ఎంతో అభిమానం. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నాగబాబుతో పాటు రోజా అంటే కూడా మంచి అభిమానం కలిగిన ఆది, నిన్న జరిగిన జబర్దస్త్ షోలో చేసిన ఒక స్కిట్ కు రోజా సహా మిగతావారందరూ కూడా ఎంతో కడుపుబ్బా నవ్వడం జరిగింది. ముందుగా పవన్ నటించిన గోపాల గోపాల సినిమాలోని సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆది, ఆ తరువాత తన స్కిట్ లో భాగంగా ఒక డైలాగ్ వేస్తాడు. 'నవ్వడానికి రెండో జడ్జ్ లేడంటే, 

 

నడవడానికి రాజమండ్రి బ్రిడ్జి కావాలందట నీలాంటిది', అంటూ నాగబాబు లేని లోటును గుర్తు చేస్తూ డైలాగ్ వేసాడు ఆది. అయితే ఆ డైలాగ్ షో లోని వారందరికీ, అది నాగబాబు ని గుర్తుచేస్తూ వేసిన డైలాగ్ అని అర్ధం కావడంతో అందరూ విపరీతంగా ఈలలు వేస్తూ గోలలు చేయడం జరిగింది. అయితే ఇదే స్కిట్ పై కొందరు మెగాఫ్యాన్స్, తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ,  ఆది, తనకు ఎంతో ఇష్టం అయిన నాగబాబు గారిని గుర్తు చేస్తూ, ఈ విధంగా స్కిట్ చేసి డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంటాడని అనుకోలేదని అతడిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: