ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ పై తమ సత్తా చాటేందుకు వస్తున్నారు సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో వస్తున్నాడు. అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. ఒకరోజు తేడాతో వస్తున్న ఈ సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. గురువారం దర్బార్ సినిమా రిలీజ్ అవుతుండగా శని, ఆదివారాల్లో మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి.

 

ఇక ఈ సినిమాలతో హీరోల మధ్య పోటీనే కాదు హీరోయిన్స్ మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా.. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దె అల్లు అర్జున్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. ఇక నాలుగు సినిమాలతోనే తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న కూడా మహేష్ సినిమా హిట్టైతే మాత్రం డబుల్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.

 

సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలతో హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్దె లు కూడా తమ క్రేజ్ పెంచుకునే అవకాశం ఉంది. హిట్టైన సినిమా హీరోయిన్ వెంట దర్శక నిర్మాతలు పడటం మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ ఇద్దరిలో సంక్రాంతికి ఎవరు హిట్టు కొడతారో చూడాలి. రెండు సినిమాలు హిట్టు కొడితే మాత్రం ఓ పక్క పూజా మరోపక్క రష్మిక వరుస ఛాన్సులతో అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం రష్మిక బన్ని, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తుంది. పూజా హెగ్దె కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఓవిధంగా ఇద్దరికి తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడిందని మాత్రం చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: