సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హిట్టు సినిమాల దర్శకులకే అవకాశం ఇస్తాడని అప్పట్లో పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికే తెరలేపాయి. పూరితో పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు చేసిన మహేష్.. ఆ తర్వాత పూరి చెప్పిన జనగణమన సినిమా కథ విన్నా, పూరి మీద నమ్మకం పెట్టలేదని మహేష్ మీద పూరి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే మహేష్ వరుస స్టార్ డైరక్టర్ తో ఛాన్స్ ఇవ్వడంపై రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా ప్రమోషన్స్ లో కూడా యాంకర్ అడిగింది.

 

ఆమె అలా అడిగే సరికి మహేష్ కు చిర్రెత్తుకొచ్చింది.. ‘‘నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా. కథ నచ్చితేనే సినిమా చేస్తా, అంతే తప్ప దర్శకుల సక్సెస్ రేటుని బట్టి కాదు. ఎఫ్2 సినిమా రావడానికి ముందే అనిల్ రావిపూడి నాకు ఈ సినిమా కథ చెప్పాడు. అప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో, అప్పట్లో కుదరలేదు. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుందని అనిల్‌కి చెప్పడంతో.. అతడు ఓకే అన్నాడు. ఇప్పుడు సమయం కలిసిరావడం, సంక్రాంతికి సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేయమని నేను చెప్పడంతో.. అనిల్ రావిపూడి చకచకా పనులు కానిచ్చి, నాలుగు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చూశాడు. ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోవడం వల్లే, అన్ని పనులు సవ్యంగా, త్వరితంగా జరిగాయి’’ అని మహేష్ చెప్పుకొచ్చాడు.  

 

తొలుత యాంకర్ అడిగిన ఆ ప్రశ్నకు మహేష్ కాస్త కోపంగానే రియాక్ట్ అయినా, ఆ తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సున్నితంగా బదులిచ్చాడు. మహేశ్ పాటించిన ఈ సంయమనం నిజంగా ప్రశంసనీయం. అయినా, ఏ ప్రశ్న ఎప్పుడు అడగాలన్న సభ్యతను మీడియా వాళ్ళు కూడా కలిగి ఉండాలి. ప్రమోషన్స్‌కి వచ్చిన తారల్ని, ఇలా చిర్రొత్తుకొచ్చే ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: