సినిమా నటీ నటులు అనగానే వారి చుట్టు వివాదాలు ఉండటం మామూలే. ఇక ఎంతగానో అభిమానించే అభిమానులతో పాటుగా, వారు చిన్న తప్పు చేసిన భూతద్దం పెట్టి మరీ ఆ తప్పును బయటకు తీసి  వివాదస్పదంగా మార్చేవారు కూడా ఉంటారు. ఇకపోతే హీరోలు గానీ , హీరోయిన్స్ గానీ చాలా యాడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ఇందుకు గాను వీరికి పెద్దమెత్తంలో రెమ్యూనరేషన్ ముట్టచెబుతారు నిర్వాహకులు. కానీ వీరు చేసే యాడ్స్ వారి అభిమానులమీద చాలా ప్రభావం చూపిస్తుంది.

 

 

అంతే కాకుండా ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంది. ఇంతే కాదు సెలబ్రెటీలు చేసే యాడ్స్ ఒక్కోసారి వివాదస్పదం అవుతాయి. ఇదిగో ఇలాగే ఒక యాడ్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అదేమంటే ఇటీవల అక్షయ్ ఓ డిటర్జెంట్ ప్రకటనలో నటించారు. ఈ ప్రకటనలో అక్షయ్ కుమార్ పాత్ర మరాఠా రాజు.. ఈ రాజు తన సేనతో కలిసి యుద్ధం చేసి  అందులో గెలిచి విజయోత్సాహంతో తిరిగి తన రాజ్యంలోకి రాగా అక్కడ అంత:పురంలోని వారందరూ అతనికి ఘన స్వాగత౦ పలుకుతుంటే మహారాణి మాత్రం ఆగ్రహంగా ఉంటుంది.

 

 

అందుకు కారణం అక్కడున్న వారి బట్టలు మురికిగా మారడం. మూతిని మూడు వంకర్లు తిప్పుతు వారి మురికి బట్టలు ఎవరు ఉతుకుతారు అంటూ ఓ డైలాగ్ వదులుతుంది.. ఇంకేముంది వెంటనే స్పందించిన మరాఠా రాజు అక్షయ్ ఓ యోధుడిలా బట్టలు అన్ని ఉతుకుతాడు.. ఇంత వరకు ఇది బాగానే ఉంది.

 

 

కానీ కొందరు మాత్రం ఈ ప్రకటన తన మనోభావాలకు విరుద్దంగా ఉందని  ముంబై లోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా ఈ ప్రకటనలో మరాఠా సంస్కృతిని, మరాఠా రాజుల వీరత్వాన్ని అవమానించారని ఆయనపై కేసు నమోదు చేసారు. దీనిపై అక్షయ్ తమకు క్షమాపణ చెప్పాలని ఆ యాడ్‌ను ఆపెయ్యాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: