బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని పేరును ‘భరత్ అనే నేను’ మూవీకి హీరోయిన్ గా రికమండ్ చేసిన వ్యక్తి నమ్రత. కొరటాల శివ అప్పట్లో ఈ సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతున్నప్పుడు మహేష్ పక్కన కియారా అన్ని విధాల బాగుంటుంది అని ఆమె మహేష్ కు కొరటాలకు నచ్చచెప్పి మరీ హీరోయిన్ అవకాశం ఇప్పించింది అని అంటారు.

అయితే అలాంటి కియారా ఇప్పుడు నమ్రతకు ఊహించని సమాధానం ఇచ్చింది అని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నమ్రత తమ సొంత నిర్మాణ సంస్థ మహేష్ బాబు ప్రోడక్షన్ హౌస్ బ్యానర్ పై అడివి శేషు తో ఒక సినిమాను తీస్తున్నారు. 

ముంబాయ్ లో జరిగిన 26/11 ఉగ్రవాదుల అటాక్ కు సంబంధించిన ఘటనలో ప్రాణాలు పోగొట్టుక్కున్న మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తీయబోతున్న మూవీని తెలుగు తమిళ హిందీ భాషలలో తీస్తున్నారు. ఈ మూవీలో కియారా హీరోయిన్ గా నటిస్తే ఆ మూవీకి మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ కూడ బాగా నడుస్తుంది అన్న ఉద్దేశ్యంతో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించదానికి కియారా ను సంప్రదించినట్లు టాక్. 

‘కబీర్ సింగ్’ ఘన విజయం తరువాత బాలీవుడ్ లో కియారా క్రేజ్ విపరీతంగా పెరిగి పోవడంతో ఆమెకు డిమాండ్ పెరిగి ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోంది. దీనితో రంగంలోకి దిగిన నమ్రత స్వయంగా కియారా ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు 5 కోట్ల పారితోషికం ముఖ్యం కాదనీ తనకు టాలీవుడ్ లైఫ్ ఇచ్చిన నమ్రత మహేష్ లు అంటే చాల గౌరవం అని చెపుతు తాను అడవి శేషు పక్కన నటించ లేను అనీ ఈ ప్రాజెక్ట్ లో అడవి శేషు కాకుండా మరెవరైనా టాప్ హీరో నటిస్తే తాను నమ్రత పై ఉండే గౌరవంతో ఒక్క రూపాయి కూడ పారితోషికం అడగకుండా నటిస్తాను అని చెప్పి  ఏకంగా నమ్రతకు మైండ్ బ్లాంక్ చేసినట్లు వార్తలు గుప్పు  మంటున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: