సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ కమర్షియల్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తర్వాత.. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇదిలా ఉంటే.. ఒక‌ప్పుడు మహేష్‌కు ఓవ‌ర్సీస్‌లో 1 మిలియ‌న్ అంటే మంచ‌నీళ్లు తాగినంత ఈజీ. బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ వంటి సినిమాలు  డిజాస్ట‌ర్ అయినా ప్రీమియ‌ర్ల‌తోనే 1 మిలియ‌న్ కొట్టేశాయి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి సరిలేరు నీకెవ్వరు చిత్రం 96 లొకేషన్స్ లో 1 లక్ష 46 వేల డాలర్లకు పైగా రాబట్టంది. దీంతో మ‌హేష్ రేంజ్‌లో అడ్వాన్స్‌లు లేవ‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే ఓవ‌ర్సీస్‌లో కొద్ది రోజులుగా మ‌హేష్ బాబు సినిమాల‌కు క్రేజ్ త‌గ్గిన‌ట్టు కూడా ట్రేడ్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

 

కాగా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాష్ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, బండ్ల గణేష్, సంగీతలు కీలకపాత్రల్లో నటించారు. ముఖ్యంగా లేడీ అబితాబ్ విజయశాంతి దాదాపు 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఫస్టాఫ్ అంతా కామెడీ ట్రాక్‌తో సాగే సినిమా.. ఇంటర్వెల్ నుంచి టర్న్ తీసుకుంటున్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇక‌ 2 గంటల 40 నిమిషాల నిడివితో జనవరి 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: