సంక్రాంతి రేస్ విన్నర్ గా మారడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ కోసం పరోక్షంగా సహకరించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ సినిమాల విషయంలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన వార్తలను నేషనల్ మీడియాలో రావడానికి కిఅనేక మార్గాలు అనుసరిస్తూ నేషనల్ మీడియా దృష్టి మహేష్ బన్ని సినిమాల పై పడేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు లేటెస్ట్ గా జరిగిన ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ ఫంక్షన్ కవరేజ్ కోసం నేషనల్ మీడియాను ఆ నిర్మాత ఖర్చుతో ముంబాయ్ నుండి పిలిపించినట్లు తెలుస్తోంది. వారికి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చి రానుపోను ఖర్చులు ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఖరీదైన హోటల్స్ లో వారికి హోస్టింగ్ ఖర్చులు కూడ భరించడం జరిగింది అన్న వార్తలు ఉన్నాయి. 

అయితే బన్నీ ఫంక్షన్ ను కవర్ చేసిన తరువాత ఆ నేషనల్ మీడియా ప్రతినిధులు వెంటనే వెళ్ళిపోకుండా మరునాడు కూడ ఉండిపోయి వారంతా మహేష్ బాబు అపాయింట్ మెంట్ తీసుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం ప్రత్యేకంగా ఇంటర్యూలు కూడ చేసి వెళ్ళి పోయినట్లు టాక్. దీనితో బన్నీ సినిమా నిర్మాత ఖర్చు పై ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాత లాభ పడ్డాడు అంటూ జోక్స్ పడుతున్నాయి.

వాస్తవానికి నేషనల్ మీడియాలో మహేష్ తో ఇంటర్వ్యూలు రావడం కొత్త కాదు. అయితే ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ దృష్టి ఇప్పుడు నేషనల్ మీడియా పై పడి ఇంటర్వ్యూలు ఇస్తూ తాను కూడ నేషనల్ స్టార్ గా మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు మంచివే అయినా ఇటువంటి ప్రయత్నాలు అన్నీ ‘అల వైకుంఠపుఅరమోలో’ నిర్మాత ఖర్చు ఫై జరుగుతూ ఉండటంతో బన్నీ తెలివి తేటలకు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: