రజనీకాంత్... ఈ పేరుకి సినీ ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ఈ  హీరోకి వీరాభిమానులు ఎంతోమంది. అయితే రజనీకాంత్ ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో సినిమాలు తీస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తనదైన స్టైల్ యాక్టింగ్ తో  సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రజినీకాంత్. అయితే గత కొంతకాలంగా రజినీకాంత్ విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఏకంగా భారీ బడ్జెట్ సినిమాతో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రోబో 2.0 సినిమా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రజనీకాంత్ అభిమానులు అందరూ సతమతమవుతున్నారు. మా అభిమాన హీరోకు హిట్  పడేది ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

 

 ఇకపోతే వరుస సినిమా ఫ్లాపులతో సతమతమవుతున్న రజనీకాంత్ తాజాగా దర్బార్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మరోసారి తనదైన స్థాయిలో హిట్ సంపాదించినట్లు కనిపిస్తోంది. దర్శకుడు మురుగదాస్ సినిమాలు రజిని యాక్షన్ సీన్స్ కామెడీ ఎలిమెంట్స్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. రొటీన్ కథే అయినప్పటికీ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి కూడా ఇరగదీశాడు అనే చెప్పాలి. రజనీకాంత్ కు అసలైన సమవుజ్జీ అనిపించాడు ఈ సినిమాలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి. 

 

 

 గతంలో బాలీవుడ్ స్టార్ హీరో అయినా అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన రోబో 2.0 సినిమా లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే విభిన్నమైన గెటప్ తో నటించినప్పటికీ.. ఆ పాత్రలు అక్షయ్ కుమార్ నటన పరంగా బాగా నటించినప్పటికీ... రోబో 2.0 సినిమాలు విలన్ పాత్రలో మాత్రం ఎక్కడో తేడా కొట్టేసి ప్రేక్షకులకు నచ్చలేదు. 2.0  సినిమాలో అక్షయ్ కుమార్ ని విలన్ గా నటింపజేసేందుకు దర్శకుడు శంకర్ కూడా ఎంతో రిస్క్ చేసి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఏం చేస్తాం ఆ రూల్ సరిగ్గా పండలేదు. కానీ ఇప్పుడు దర్బార్ కోసం మరో బాలీవుడ్ నటుణ్ని  తీసుకొచ్చాడు దర్శకుడు మురుగదాస్. ఇప్పుడు దర్శకుడు మురుగదాస్ ప్లాన్ హిట్ అయినట్లు కనిపిస్తోంది. విలన్ రోల్ లో దర్బార్ సినిమాలో సునీల్ శెట్టి ఇరగదీసాడు. ఇక దర్బార్ సినిమాలో రజనీ సునీల్ శెట్టి ల మధ్య ఎత్తులు పై ఎత్తులతో సెకండాఫ్ సినిమా మొత్తం అదుర్స్ అనిపిస్తుంది. ఇక అభిమానులు కూడా సునీల్ శెట్టి ఈ సినిమాలో విలన్ గా చేయడం ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయిందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: