జూనియర్ ఎన్టీఆర్ నుండి సినిమా రాక సంవత్సరం దాటిపోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ కే తన డేట్లన్నీ ఇచ్చేశాడు. రాజమౌళితో ఎన్టీఆర్ చేస్తున్న నాలుగవ చిత్రమిది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచుస్తున్నారో తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎన్టిఆర్ మొదటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రాజమౌళి ఉన్న్ పాపులారిటీ ద్వారా ఈ సినిమా తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో రిలీజ్ చేస్తారట.

 

అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఎన్టిఆర్ ఏ ఫంక్షన్లలోనూ కనబడింది లేదు. ఎప్పుడైనా కనబడినా అరకొరగానే మాట్లాడారు. అందుకని ఎన్టీఆర్ సుధీర్ఘ ప్రసంగం కోసం ఎన్టిఆర్ అభిమానులు ఎంత గానో వెయిట్ చేశారు. అభిమానులని ఉద్దేశించి అనర్గళంగా మాట్లాడగల ఒకే ఒక్క కథానాయకుడు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ మాట్లాడితే ఎంతసేపైనా వినడానికి సిద్ధంగా ఉంటారు.

 

అలాంటిది నిన్న జరిగిన ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసిన ఎన్టీఆర్ మూడు ముక్కలో ముగించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఎప్పటిలాగే సుదీర్ఘ ప్రసంగం చేస్తారనుకుంటే అనూహ్యంగా ఐదు నిమిషాల లోపే తన ప్రసంగం ముగించారు. దర్శక నిర్మాతలకు బెస్ట్ విశెష్ చెప్పిన ఎన్టీఆర్…తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూడాలి అనుకున్న తన కోరిక సతీష్ వేగేశ్న తీర్చారు అన్నారు. 

 

అలాగే సంక్రాంతి సినిమాలకు బెస్ట్ విశెష్ చెప్పారు. ఈ ఫంక్షన్ లో గుబురు గడ్డంతో కనిపించిన ఎన్టిఆర్ ని కొమరం భీం అంటూ అభిమానులు సందడి చేశారు. మంచి వాడవురా మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 15న విడుదల కానుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: