సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాల్లో మొదటి స్థానం రజనీనే కొట్టేశారు. అంటే మొట్ట మొదట రజనీ చిత్రమే విడుదలైంది. అలాగే గత చిత్రాలన్నీ రజనీకి నిరాశే చూపగా. ఈ చిత్రం మాత్రం కాస్త పర్వాలేదనిపించుకుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం రజనీ రేంజ్ని అందుకోలేకపోయినా కాస్త పర్వాలేదనిపించింది. కథ కథనాలు ఎలా ఉన్నా స్క్రీన్ప్లే మాత్రం అదిరిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన రజనీ చిత్రాలు కాలా, కబాలి, పేట, ఇవన్నీ రజనీకి తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. మురుగుదాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు రజనీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అదే అందించినట్లు అనిపించింది.
దర్శకుడు మంచి మైండ్గేమ్తోపాటు, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాను రసవత్తరంగా తెరకెక్కించారని అప్పుడే సోషల్ మీడియాలో కితాబులు వస్తున్నాయి. చాలా కాలం తరువాత రజనీలోని అసలైన హీరోయిజం బయట పడిందని ట్విట్టర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రజనీ ఎంట్రీ నుంచి ప్రతి సీన్ సూపర్బ్ గా ఉందని చెబుతున్నారు. రజనీ మరోసారి ఆయన మ్యాజిక్ ని ప్రేక్షకులకు చాలా కాలం తర్వాత రుచి చూపించారు. చిత్రం సూపర్ హిట్ అని తాజా టాక్. రజనీ సరసన నయనతార, నివేదా థామస్ లతో పాటు బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ తదితరులు ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఎవరి పాత్రకు తగ్గట్టు వారు న్యాయం చేశారనే చెప్పాలి. ఈ చిత్రంలోఎన్కౌంటర్స్ తో ఆదిత్య అరుణాచలం న్యాయం చేసాడు. రజినీ సునీల్ శెట్టి కోసం వెతకే సన్నివేశాలు దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రీకరించారనే చెప్పాలి. తలైవర్ థీమ్ సాంగ్ తో రజినీ మార్క్ డాన్స్ మూమెంట్స్ అదిరాయి. రజినీను ఎలివేట్ చేసే సీన్స్ తో డీసెంట్ గా సాగింది. రజినీ నయన్ను కలిసేటప్పుడు వచ్చే మొదటి డైలాగ్ సూపర్బ్ అంటూ సోషల్ మీడియాలో డైలాగ్ వైరల్ అవుతుంది. తన ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ "ఇప్పుడు చూడు" అంటూ కలిశారు. మొత్తానికి ఈ సంక్రాంతి రేసేను రసవత్తరంగా మార్చిన రజనీ.